అక్షరటుడే, వెబ్డెస్క్ :India | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ దాడి వెనుక పాకిస్తాన్(Pakistan) ఉందని ఇప్పటికే ఆ దేశానికి సింధు జలాలను(Indus River) భారత్ ఆపేసింది.
మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) నిత్యం రక్షణ, హోం శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించాయి. భారత్ దాడి చేస్తే తాము ఎదురు దాడి చేస్తామని పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
India | విమానాలు రాకుండా..
భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్పై దాడి చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత్ కీలక జామర్ వ్యవస్థ(Jammer system)ను సరిహద్దులో మోహరించింది. పాక్ మిలిటరీ విమానాలు(Pak military aircraft) లక్ష్యాలను గుర్తించేందుకు వీలులేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్(Electronic warfare) వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇది పాక్ యుద్ధ విమనాలు వినియోగించే జీపీఎస్(GPS), గ్లోనాస్(GLONASS), బైడూస్(Baidus)లను అడ్డుకుంటుంది. దీంతో ఆ విమానాలు లక్ష్యాలను గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. పాక్ విమానాలతో పాటు, డ్రోన్లు(Drones), గైడెడ్ మిసైల్స్(Guided Missiles) భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయి.