అక్షరటుడే, వెబ్డెస్క్: INS Vikrant | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)తో భారత్, పాకిస్తాన్(Ind – Pak) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో దాయాదికి ఊహించని రీతిలో దెబ్బ కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మరోసారి ఉగ్రదాడులు చేయాలంటే భయపడేలా నలువైపులా నుంచి పాక్ను దిగ్బంధనం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇటు నేవీ, అటు ఎయిర్ఫోర్స్, మరోవైపు సైన్యాన్ని సన్నద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపి పాక్ లోని కరాచి పోర్టుపై భీకర దాడులు చేసింది.
INS Vikrant | తిరుగులేని శక్తి..
పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ భారత నౌకాదళం(Indian Navy) ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రం(Arabian Sea)లో మోహరించింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ నౌక పహారా కర్ణాటకలోని కర్వార్ తీరంలో కాస్తోంది. 262 మీటర్ల పొడవు, 45 వేల టన్నుల బరువు కలిగి ఉన్న ఈ నౌక.. 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. పాక్లోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవులను విక్రాంత్ సులభంగా విధ్వంసం చేయగలదు. ఈ విమాన వాహక నౌకలో మిగ్-29కే యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు 60శాతం వరకు సముద్ర మార్గాలను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
రూ.20 వేల కోట్లతో నిర్మించిన ఈ విమాన వాహక నౌకలో 30 యుద్ధ విమానాలను నిలిపేంత విశాలస్థలం ఉంటుంది. 262 మీటర్ల పొడవు, 45 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ నౌకపై మిగ్-29(MIG-29K)కే ఫైటర్ జెట్లు, 32 కమోవ్చ ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లు, దేశీయంగా తయారైన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్హెచ్), లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) విమానాలతో సహా 30 రకాల విమానాలను మోసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. ఈ యుద్ధనౌకలో మొత్తం 18 డెక్లు, 2,400 గదులు ఉండగా, 1,600 మంది సైనికులు పని చేస్తారు. భారత్ వద్ద ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఒకటి విక్రమాదిత్య, మరొకటి విక్రాంత్. ఈ నౌకలను హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.
INS Vikrant | గతంలో పాక్పై నేవీ ఆధిపత్యం..
భారత్లో నిర్మించిన స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant) పేరే పెట్టారు. నాటి యుద్ధంలో పాక్ను చావుదెబ్బ కొట్టిన ఘనత ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant)కు ఉంది. మన దేశంపై దాడి చేసేందుకు యత్నించిన పాక్.. విక్రాంత్ను టార్గెట్గా చేసుకుంది. దీన్ని గుర్తించిన ఇండియన్ నేవీ(Indian Navy) పాక్ను ఏమార్చింది. వైజాగ్లో ఉన్న మరో వాహక నౌకను విక్రాంత్గా శత్రువులు పొరబడేలా కొన్ని టెక్నికల్ ఇండికేషన్స్తో ఏమార్చింది. విక్రాంత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్ తన అత్యాధునికమైన ఘాజీని పంపించింది. ఇది గమనించిన ఇండియన్ నేవీ రెండు బాంబులతో ఘాజీని సముద్ర గర్భంలోనే కలిపేసింది.