అక్షరటుడే, వెబ్డెస్క్: NUDA Chairman Kesha Venu | నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రతిపాదించినట్లు నుడా చైర్మన్ కేశ వేణు nuda chairman kesha venu తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ మురళీ మనోహర్ రెడ్డి(EE Murali Manohar Reddy), ఏఈ వాజిద్ ఖాన్(AE Wajid Khan), రషీద్ ఖాన్(Rashid Khan)తో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా వర్షాకాలంలో నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. వర్షాకాలంలో ఆయా కాలనీల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కోసం అంచనా బడ్జెట్(Budget) ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేష్ గౌడ్, సుదర్శన్ రెడ్డికి విన్నవిస్తామన్నారు.