అక్షరటుడే, వెబ్డెస్క్: CM Principal Secretary | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ముఖ్య కార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.శ్రీనివాసరాజు(Retired IAS officer Srinivasa Raju) నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంధ్రప్రదేశ్ కేడర్ నుంచి రిటైర్డ్ అయిన శ్రీనివాసరాజు గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు టీటీడీ జేఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా టీటీడీ(TTD)లోనే పనిచేసేందుకు ఆయన ఆసక్తి చూపినప్పటికీ.. తీరా అవకాశం దక్కలేదు. తదనంతరం ఆయన ఐఏఎస్గా వాలంటరీ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను సలహాదారుగా నియమించింది. తిరిగి సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా(CM Principal Secretary) నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే సీఎస్గా బుధవారం పదవీ విరమణ చేసిన శాంతికుమారికి ఎంసీహెచ్ఆర్డీ వైస్ ఛైర్మన్గా(MCHRD Vice Chairman) పదవి కట్టబెట్టారు. తాజాగా శ్రీనివాసరాజుకు ఈ పదవి ఇవ్వడం చర్చకు దారితీసింది.