అక్షరటుడే, వెబ్డెస్క్: KA Paul | ఏపీలోని కూటమి సర్కారుపై ప్రజాశాంతి పార్టీ(Praja shanti party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయం(Simhachalam Temple)లో జరిగిన ఘటనపై స్పందించారు. గోడ కూలిన ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గతంలో తిరుపతిలోనూ తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దర్శనాల కోసం టికెట్ల రూపేనా డబ్బులు తీసుకుని కోట్లు సంపాదిస్తున్నారని, అలాంటి సమయంలో ప్రజలకు సరిపడా సౌకర్యాలు కల్పించరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆలయాలకు కూడా చర్చిల మాదిరిగానే కమిటీలు వేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.