అక్షరటుడే, వెబ్డెస్క్: National Security Advisory Board | పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం union government of India కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా NSA బోర్డు పునర్ వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టింది.
ఏడుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఛైర్మన్గా రాRaw మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. అంతేకాకుండా సభ్యులుగా పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ కన్నా, మాజీ ఐపీఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి వెంకటేశ్ వర్మ తదితరులను నియమించింది. బోర్డు సభ్యులుగా మాజీ మిలిటరీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు.
పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కేంద్రం ఈ బోర్డును ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ఈ విషయాలను కేంద్ర మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.