More
    Homeబిజినెస్​Stock market | నష్టాల్లో గిఫ్ట్‌ నిఫ్టీ.. గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌కు అవకాశం

    Stock market | నష్టాల్లో గిఫ్ట్‌ నిఫ్టీ.. గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌కు అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. మంగళవారం అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ 0.58 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.56 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం సోమవారం 0.19 శాతం నష్టంతో కదలాడుతోంది.

    Stock market | యూరోప్‌లో..

    యూరోపియన్‌ మార్కెట్లు మంగళవారం మిక్స్‌డ్‌(Mixed)గా ముగిశాయి. డీఏఎక్స్‌ 0.69 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.54 శాతం పెరగ్గా.. సీఏసీ 0.50 శాతం నష్టపోయింది.

    Stock market | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..

    ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.40 శాతం లాభంతో కొనసాగుతుండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.28 శాతం, నిక్కీ(Nikkei) 0.17 శాతం పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. కోస్పీ 0.76 శాతం నష్టంతో ఉండగా.. హంగ్‌సెంగ్‌ 0.35 శాతం, షాంఘై 0.2 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.4 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ డౌన్‌(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  PRE MARKET ANALYSIS | ఇరాన్​పై యూఎస్ దాడి.. ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు

    Stock market | గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. మంగళవారం నికరంగా రూ. 2,385 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు సైతం నికరంగా రూ. 1,369 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. ఎఫ్‌ఐఐలు మన మార్కెట్‌లో వరుసగా పది ట్రేడింగ్‌(Trading) సెషన్లలో నికర కొనుగోలుదారులుగా నిలవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

    • రూపాయి విలువ డాలర్‌తో 21 పైసలు తగ్గి 85.25 కి చేరింది.
    • డాలర్‌ ఇండెక్స్‌ 0.11 శాతం పెరిగి 99.35 వద్ద ఉంది.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.79 శాతం తగ్గి 59.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
    • దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic stock markets)లో మంగళవారం వొలటాలిటీ పెరిగింది. వొలటాలిటీ ఇండెక్స్‌ 2.54 శాతం పెరిగి, 17.37 వద్ద ఉంది. విక్స్‌ పెరగడం బుల్స్‌కు ప్రతికూలం.
    • భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. వచ్చే 36 గంటల్లో భారత్‌(Bharath) దాడి చేసే అవకాశాలున్నాయని పాకిస్థాన్‌ భావిస్తోంది.
    • అమెరికా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సెప్టెంబర్‌లో సుంకాలు తగ్గే అవకాశాలున్నాయి.
    • యూఎస్‌(US)తో వాణిజ్య యుద్ధం విషయంలో చైనా వెనక్కి తగ్గుతోంది. అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఇథేన్‌పై 125 శాతం టారిఫ్‌ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది.
    • ఈరోజు అదాని పవర్‌(Adani power), ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ టవర్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, పారస్‌ డిఫెన్స్‌, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, వరుణ్‌ బేవరేజెస్‌, ఐవోసీ, ఎంవోఐఎల్‌ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి.
    READ ALSO  Ellenbarrie Industrial Gases IPO | నేటినుంచి మరో మెయిన్ బోర్డు ఐపీవో ప్రారంభం

    Latest articles

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు...

    TV Anchor Swetcha | యాంక‌ర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. ఆమె ఆత్మహత్యకు అతనే కారణమన్న తల్లిదండ్రులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TV Anchor Swetcha | టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు....

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union...

    Journalist Vittal Vyas | జర్నలిస్ట్‌ విఠల్‌ వ్యాస్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Journalist Vittal Vyas | జమాల్‌పూర్‌ విఠల్‌ వ్యాస్‌ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్‌...

    More like this

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు...

    TV Anchor Swetcha | యాంక‌ర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ట్విస్ట్‌.. ఆమె ఆత్మహత్యకు అతనే కారణమన్న తల్లిదండ్రులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: TV Anchor Swetcha | టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు....

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union...