అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGS RTC)లో సమ్మె సైరన్ మోగనుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ సిబ్బంది RTC workers strike సమ్మెకు పిలుపునిచ్చారు. లేదంటే మే 7 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని తేల్చి చెప్పారు.
కేసీఆర్ KCR హయాంలో 2019 అక్టోబర్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం సిబ్బంది సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో అప్పుడు సమ్మె చేపట్టారు. అయితే ప్రభుత్వం దిగిరాకపోవడంతో కార్మికులే వెనక్కి తగ్గారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు.
RTC | హామీలు అమలు చేయాలని..
కాంగ్రెస్ congress తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమకు ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్ అయిన 16 వేల మంది స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.
RTC | అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలి
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలపాలని జేఏసీ JAC నాయకులు కోరారు. కొన్ని సంఘాల నాయకులు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్లోనే జేఏసీ నాయకులు ఆర్టీసీ సంస్థకు సమ్మె నోటీసు అందించారు. యాజమాన్యం, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి.