అక్షరటుడే, వెబ్డెస్క్ : Ind – Pak | జమ్మూ కశ్మీర్ Jammu Kashmir లోని పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror atack నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుశ్చర్య వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలతో పాటు సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ సింధూ నది జలాలు ఆపడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా భారత్ నుంచి పాక్కు ఎగమతి అయ్యే వస్తువలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Ind – Pak | పతనం అంచున..
పాకిస్తాన్ pakistan ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పతనం అంచున ఉంది. తాజాగా భారత్తో ఉద్రిక్తత నేపథ్యంలో ఆ దేశ పరిస్థితి మరింత దిగజారింది. పాక్ స్టాక్మార్కెట్లు stock markets కుప్పకూలాయి. అక్కడ ద్రవ్యోల్బణం Inflation సైతం విపరీతంగా పెరిగింది. తాజాగా భారత్ తన ఎగుమతులు పాక్ దేశానికి వెళ్లకుండా అడ్డుకుంటే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారనుంది.
Ind – Pak | యూఏఈ నుంచి పాక్ దిగుమతి
భారత్–పాక్ మధ్య ఉన్న శత్రుత్వం నేపథ్యంలో రెండు దేశాలు నేరుగా ఏ వస్తువులను దిగుమతి చేసుకోవు. అయితే పాక్ మాత్రం భారత్ వస్తువులను యూఏఈ UAE నుంచి దిగుమతి చేసుకుంటుంది. మొదట భారత్కు చెందిన వస్తువులు యూఏఈకి వెళ్తాయి. వాటిపై లేబుళ్లను మార్చి అక్కడి కొన్ని కంపెనీలు మళ్లీ పాక్కు ఎగుమతి చేస్తుంటాయి. ఇలాంటి ఎగుమతులను సైతం ఆపాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఈక్రమంలో పాక్కు ఎగుమతి చేసే ఔషధాలు Medicine, ఫార్మా Pharma ఉత్పత్తుల వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్ను కోరింది. ఆ దేశం ఇండియా నుంచే ఎక్కువ శాతం ఔషధాలను దిగుమతి చేసుకుంటోంది. వీటిని ఆపేస్తే పాకిస్తాన్కు మరిన్ని ఇబ్బందులు రానున్నాయి. అలాగే ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపైనా ఆంక్షలు పెట్టాలని భారత్ యోచిస్తోంది.