ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (Tirumala Tirupati Devasthanams Board) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు Chairman B.R. Naidu, ఈవో శ్యామలరావు EO Shyamala Rao ప్రారంభించారు.

    Tirumala : ప్రయోజనం ఏమిటంటే..

    స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండదు. తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించగలిగే విధంగా పరిశోధనశాలను తీర్చిదిద్దారు.

    Tirumala : కల్తీ నెయ్యి వ్యవహారంతో..

    తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని ఇప్పటివరకు లేదు. కాగా, గతంలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూడటంతో.. తాజాగా స్థానికంగానే నెయ్యి నాణ్యతను పరీక్షించే ఏర్పాట్లను చేశారు.

    READ ALSO  Vishakapatnam | విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం

    నెయ్యిలో నాణ్యత శాతం, కల్తీ శాతాన్ని వెంటనే విశ్లేషించే HPLC (High Performance Liquid Chromatograph), GC (Gas Chromatograph) యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ యంత్రం విలువ రూ.75 లక్షల వరకు ఉంటుంది. దీనిని గుజరాత్​ (Gujarat) కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (National Dairy Development Board – NDDB) విరాళంగా అందజేసింది.

    Tirumala : మైసూర్​లో ప్రత్యేక శిక్షణ..

    ఆహార నాణ్యత పరిశీలనలో పాలుపంచుకునే సిబ్బంది, పోటు కార్మికులకు మైసూర్‌ (Mysore) లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఆహార నాణ్యత పరిశోధనశాల ప్రారంభ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.

    READ ALSO  Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    Latest articles

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    Justice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Verma | అభిశంస‌న‌ను ఎదుర్కొంటున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు బుధవారం...

    Election Commission | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ప్ర‌క్రియ ప్రారంభం.. ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల సంఘం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Election Commission | భారత ఉపరాష్ట్రపతి(Vice President) పదవి ఎన్నిక ప్ర‌క్రియను ప్రారంభించిన‌ట్లు కేంద్ర...

    More like this

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    Justice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Verma | అభిశంస‌న‌ను ఎదుర్కొంటున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు బుధవారం...