ePaper
More
    HomeజాతీయంMaharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Maharashtra | భర్తను చంపి ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra) లో మరో దుర్మార్గం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను చంపిందో కసాయి పెళ్లాం. తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పైకి ఏర్పడకుండా టైల్స్ కూడా వేసింది. మహారాష్ట్రలోని పాల్ఘర్​ జిల్లా (Palghar district) లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సంచలనంగా మారింది.

    Maharashtra : వివరాల్లోకి వెళ్తే..

    ధనివ్​ బాగ్ ప్రాంతంలో విజయ్ చౌహాన్​ (34), చమన్ అలియాస్​ గుడియా దేవి (32) దంపతులు ఉంటున్నారు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లి అయింది. రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా గుడియా దేవికి వీరి ఇంటి పక్కనే ఉండే మోను విశ్వకర్శ (33) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

    READ ALSO  Apache Helicopters | భార‌త్‌కు చేరుకున్న అపాచీ హెలికాప్ట‌ర్లు.. తొలి బ్యాచ్‌లో వ‌చ్చిన మూడు అపాచీలు

    ఈ క్రమంలో వీరి అక్రమ బంధానికి విజయ్​ అడ్డుగా ఉన్నాడని గుడియా, విశ్వకర్మ భావించారు. అతడిని కడతేర్చాలని ప్లాన్​ వేశారు. సుమారు పక్షం రోజుల క్రితం వారు కలిసి అమాయక భర్త విజయ్​ను ఇంట్లోనే హత్య చేశారు.

    అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పెద్ద ప్లానే వేశారు. ఏకంగా ఇంట్లోనే గొయ్యి తవ్వారు. అందులో పాతిపెట్టి, పైన ఏర్పడకుండా కొత్త టైల్స్ వేశారు.

    Maharashtra : చేసిన పాపం దాగదుగా..

    ఇదిలా ఉంటే విజయ్​ తోబుట్టువులు ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు మనీ అవసరం కావడంతో విజయ్​ సాయం కోసం వచ్చారు. విజయ్​కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్​ఆఫ్​ రావడంతో నేరుగా ఇంటికి వెళ్లగా.. తన భర్త కుర్లా వెళ్లినట్లు గుడియా చెప్పి, వారిని వెనక్కి పంపించింది.

    READ ALSO  Vice President | ఉప రాష్ట్రపతి ధన్​ఖడ్​ రాజీనామాకు ఆమోదం

    కొద్ది రోజులకు (జులై 19) వారు గుడియాకు ఫోన్​ చేశారు. విజయ్​ వచ్చాడో లేదో తెలుసుకోవడానికి. కానీ, వారికి గుడియా ఫోన్​ Phone కూడా స్విచ్​ ఆఫ్​ అని వచ్చింది. దీంతో విజయ్ తోబుట్టువులు అనుమానంతో పెల్హార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్​ ఇంటిని House పరిశీలించారు. ఫ్లోర్​పై కొత్త టైల్స్ కనిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూడగా.. విజయ్​ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

    స్థానిక తహసీల్దార్​ tehsildar నేతృత్వంలో వైద్యులు Doctors, ఫోరెన్సిక్​ forensic నిపుణులు ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్​మార్టం నిమిత్తం ముంబయి (Mumbai) లోని జేజే ప్రభుత్వ ఆసుపత్రి (JJ Government Hospital) కి మృతదేహాన్ని పంపించారు.

    Latest articles

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    Justice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Verma | అభిశంస‌న‌ను ఎదుర్కొంటున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు బుధవారం...

    Election Commission | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ప్ర‌క్రియ ప్రారంభం.. ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల సంఘం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Election Commission | భారత ఉపరాష్ట్రపతి(Vice President) పదవి ఎన్నిక ప్ర‌క్రియను ప్రారంభించిన‌ట్లు కేంద్ర...

    More like this

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    Justice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Verma | అభిశంస‌న‌ను ఎదుర్కొంటున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు బుధవారం...