ePaper
More
    HomeజాతీయంAir India Flight | ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

    Air India Flight | ఎయిర్​ ఇండియా విమానంలో మంటలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India Flight | ఎయిర్​ ఇండియా (Air India) విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) మంగళవారం చోటు చేసుకుంది. హాంకాంగ్​ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో ల్యాండ్​ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

    హాంకాంగ్​ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం ల్యాండ్​ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పార్కింగ్​ గేట్​ వద్దకు చేరుకున్న తర్వాత సహాయక విద్యుత్ యూనిట్​లో (APU) మంటలు చెలరేగాయి. ఇంజిన్లు ఆపేసిన తర్వాత విమానానికి ఏపీయూ నుంచి విద్యుత్​ సరఫరా అవుతుంది. ప్రయాణికులు విమానం నుంచి దిగే సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో విమానానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Justice Verma | జ‌స్టిస్ వ‌ర్మ పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ‌.. ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

    Air India Flight | వరుస ఘటనలతో ఆందోళన

    అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన (Ahmedabad Plane Crash) విషయం తెలిసిందే. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన బోయింగ్​ విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు.

    ఈ ప్రమాదం తర్వాత దేశంలో విమానాలకు సంబంధించి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ముంబైలో ల్యాండ్​ అవుతుండగా.. రన్​వేపై (Plane Skid on Runway) జారిపోయింది. ఈ ఘటనలో విమానం మూడు టైర్లు పగిలిపోగా.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

    సాంకేతిక సమస్యలతో విమానాలు రన్​వేపై నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing)​ చేస్తుండడంతో ఫ్లైట్​ ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ విమానం ఇంజిన్​లో సాంకేతిక సమస్య రావడంతో పైలట్​ పాన్​ కాల్​ ఇచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. ఇలాంటి ఘటనలతో విమాన ప్రయాణికులు భయపడుతున్నారు. విమానాలను ముందుగానే పూర్తిగా తనిఖీ చేసి ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.

    READ ALSO  Crocodile | నడిరోడ్డుపై మొసలి ప్రత్యక్షం.. చకచకా వాకింగ్​.. వీడియో వైరల్​..!

    Latest articles

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...

    KRCL Notification | పదో తరగతితో రైల్వేలో ఉద్యోగం.. వచ్చేనెల 12 వరకు దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KRCL Notification | పదో తరగతి(Tenth class) విద్యార్హతతో రైల్వే శాఖలో ఉద్యోగం కోసం...

    More like this

    Rajagopal Reddy | మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajagopal Reddy | మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు...

    Notam | పాక్ విమానాల‌పై నిషేధం పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Notam | ప‌హాల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ విమానాల‌పై నిషేధం విధించిన కేంద్రం.. ఆ...

    Fake Embassy | వీడు మాములోడు కాదు.. ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం పెట్టేశాడుగా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Embassy | నకిలీ సంస్థలు పెట్టి ప్రజలను మోసం చేయడం చూస్తుంటాం. గతంలో...