ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​IndiGo Flight | 40 నిమిషాలపాటు గాలిలోనే ఇండిగో విమానం చక్కర్లు.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

    IndiGo Flight | 40 నిమిషాలపాటు గాలిలోనే ఇండిగో విమానం చక్కర్లు.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

    Published on

    అక్షరటుడే, తిరుమల: IndiGo Flight | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) లో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఇండిగో విమానం (IndiGo plane) సుమారు 40 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఏర్పడింది. ఎట్టకేలకు 40 నిమిషాల తర్వాత తిరిగి తిరుపతిలోనే ల్యాండ్ అయింది.

    కాగా, ఈ ఘటన జరిగిన తర్వాత విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్టు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడం ఇందుకు కారణం. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లకు తోడు విమానాశ్రయంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

    IndiGo Flight | ఇటీవలే..

    ముంబయి(MUMBAI)లో ఇలాంటి ఘటనే ఇటీవల చోటుచేసుకుంది. ఇండిగో విమానానికి చెందిన ఇంజిన్​ గాలిలో ఉండగానే ఫెయిల్ అయ్యింది. దీంతో ప్రయాణికులు భయంతో గుండెను అరచేతిలో పట్టుకున్నంత పనిచేశారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

    READ ALSO  SpiceJet | స్పైస్ జెట్​లో సాంకేతిక లోపం.. నిలిచిన తిరుపతి వెళ్లాల్సిన విమానం.. ఆందోళనలో ప్రయాణికులు

    కాగా, అప్రమత్తమైన పైలట్.. ప్యాన్ ప్యాన్ ప్యాన్.. అని ఏటీసీకి సందేశం పంపించాడు. దీని అర్థం.. ప్రాణాపాయం లేదు కానీ, ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని పైలట్ పంపే సందేశం. అయితే, ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చింది.

    దీంతో విమానాన్ని వెంటనే పైలట్​ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Chhatrapati Shivaji Maharaj International Airport)లో ఎమర్జెన్సీగా ల్యాండ్​ చేశాడు. అలా ప్రమాదం తప్పింది. కాగా, ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.

    ఈ విమానం దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు నుంచి గోవాకు బయలుదేరింది. కాగా, గాలిలో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ కావడంతో ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. భువనేశ్వర్​ ఉత్తరాన 100 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఎగురుతున్నప్పుడు ఇంజిన్​ ఫెయిల్​ అయినట్లు అధికారులు తెలిపారు.

    READ ALSO  Pod Taxis | హైదరాబాద్​లో ట్రాఫిక్​ కష్టాలకు చెక్​.. త్వరలో పాడ్​ ట్యాక్సీలు!

    కాగా, అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 282 మంది మరణించారు. వసతి గృహంపై విమానం కుప్పకూలడంతో వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు.

    ఈ ఘటన తర్వాత విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు వెలుగు చూడటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు ఇటీవల తిరుపతికి వెళ్లే విమానాలు తరచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మొన్ననే సాంకేతిక సమస్యతో తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్​ శంషాబాద్​ విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పుడేమో ఏకంగా గాలిలో ఉండగానే ఇండిగో విమానం ప్రయాణికులకు 40 నిమిషాల పాటు చుక్కలు చూపించింది.

    Latest articles

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం వితరణ.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన ఉత్తమ పత్ని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తను భార్య చంపడం ట్రెండింగ్​ (trending) అనుకుంటున్నారేమో.. కానీ, రోజుకో ఘటన వెలుగుచూస్తోంది....

    CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా...

    More like this

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం వితరణ.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన ఉత్తమ పత్ని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తను భార్య చంపడం ట్రెండింగ్​ (trending) అనుకుంటున్నారేమో.. కానీ, రోజుకో ఘటన వెలుగుచూస్తోంది....