ePaper
More
    Homeక్రైంVisakhapatnam | డిపాజిట్ల పేరిట రూ.వంద కోట్ల మోసం.. పరారీలో రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి

    Visakhapatnam | డిపాజిట్ల పేరిట రూ.వంద కోట్ల మోసం.. పరారీలో రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Visakhapatnam | డిపాజిట్ల పేరిట రూ.100 కోట్లు సేకరించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం (Visakhapatnam)లో మ్యాక్స్ సంస్థ (Max company) 12శాతం వడ్డీ ఇస్తామని నమ్మించి ఉద్యోగులు, రిటైర్డ్​ ఉద్యోగుల నుంచి విరాళాలు సేకరించింది. అనంతరం బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, రిటైర్డ్​ ఐఆర్​ఎస్ (Retired IRS)​ అధికారి శివభాగ్యారావు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Visakhapatnam | అంబేడ్కర్ పేరిట..

    విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు అంబేడ్కర్ ఆశయ సాధన పేరుతో 2008లో మ్యాక్స్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. 12 శాతం వడ్డీ ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులను, పెన్షనర్లను నమ్మించారు. దీంతో ఆయన మాటలను నమ్మిన దాదాపు 2500 మంది రూ.వంద కోట్ల వరకు డిపాజిట్​ చేశారు. మొదట వడ్డీ సక్రమంగా చెల్లించిన సంస్థ.. తర్వాత కార్యకలాపాలను తగ్గించడం మొదలు పెట్టింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను పోలీసులు తాజాగా అరెస్ట్​ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌కు విధించింది.

    READ ALSO  KKY Highway | కేకేవై రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

    Visakhapatnam | పరారీలో ప్రధాన నిందితుడు

    ఈ కేసులో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరు సీతామహాలక్ష్మి, ఎల్ విశ్వేశ్వరరావు, ఎకౌంటెంట్ ధనలక్ష్మి, మేనేజర్ రంగారావును పోలీసులు అరెస్ట్​ చేశారు. ఛైర్మన్​ శివభాగ్యారావుతో పాటు మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Latest articles

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తను భార్య చంపడం ట్రెండింగ్​ (trending) అనుకుంటున్నారేమో.. కానీ, రోజుకో ఘటన వెలుగుచూస్తోంది....

    CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా...

    More like this

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన కసాయి భార్య

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తను భార్య చంపడం ట్రెండింగ్​ (trending) అనుకుంటున్నారేమో.. కానీ, రోజుకో ఘటన వెలుగుచూస్తోంది....