Hydraa | హైడ్రా తీరుపై మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
Hydraa | హైడ్రా తీరుపై మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hydraa | హైడ్రా hydraa.. ఈ పేరు వింటేనే హైదరాబాద్‌ hyderabad city వాసులు హడలిపోతున్నారు. ప్రత్యేకించి నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు, ఎఫ్‌టీఎల్‌ జోన్‌ స్థలాలను కబ్జా చేసిన వారికి హైడ్రా షాక్‌ ఇస్తోంది. అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఇటీవల హైడ్రా తీరుపై హైకోర్టు High court hyderabad మొట్టికాయలు వేయడంతో కొన్నాళ్లు కూల్చివేతలు ఆపేశారు. తిరిగి హైడ్రా కూల్చివేతల పర్వం మొదలుపెట్టింది.

ఈ తరుణంలో ప్రతిపక్షాల నేతలు హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ brs working president ktr చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. తాజాగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ ex mlc dileep పలు వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా ప్రముఖుల ఇళ్లను వదిలేసి సామాన్యుల మీద పడుతోంది. చాలా చోట్ల వందల ఎకరాలు పడి ఉంటే హెచ్‌సీయూ భూములపై కన్నేశారు. తీరా మూసీ సుందరీకరణ అంటున్నారు. దీంతో రేవంత్‌ రెడ్డిని మంత్రులు సైతం లెక్కచేయడం లేదు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

READ ALSO  AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి