అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth Reddy | బీఆర్ఎస్ సభలో కేసీఆర్(KCR) తన అక్కసును వెళ్లగక్కారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జానారెడ్డి(Jana Reddy)తో చర్చల అనంతరం మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తాను సీఎం(CM) అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆరే(KCR) కారణమన్నారు.
రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. మావోయిస్టు శాంతి చర్చల కమిటీ రిక్వెస్ట్ను అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి పని చేస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్(Operation Kagar)పై జాతీయస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. గతంలో మావోయిస్టులతో జానారెడ్డి, కేకేనే చర్చలు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆ వ్యవహారం అంతా జానారెడ్డి, కేకేలే చూస్తారని చెప్పారు.