More
    Homeక్రీడలుShahid Afridi | ఉగ్రదాడి.. భారత బలగాల చేతకాని తనం: అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

    Shahid Afridi | ఉగ్రదాడి.. భారత బలగాల చేతకాని తనం: అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Shahid Afridi | భారత సైన్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది cricketer Shahid Afridi సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత బలగాల చేతకాని తనంతోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి(Pahalgam Terror Attack) చోటు చేసుకుందని ఆరోపించాడు. భారత సైన్యం సరైన భద్రత కల్పించి ఉంటే ఈ ఘటనే జరిగేది కాదని అభిప్రాయపడ్డాడు. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్‌(Pakistan)పై నిందలు మోపుతున్నారని తెలిపాడు. భారత మీడియా, క్రికెటర్లు అందరూ పాకిస్థాన్‌ను నిందించే పనిలో పడ్డారని అసహనం వ్యక్తం చేశాడు.

    ఈ నెల 22న పహల్గాం(Pahalgam)లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని ఖండించిన భారత ప్రభుత్వం(Indian Government).. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయంగా పాక్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది.

    READ ALSO  Anderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    భారత ప్రభుత్వ చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అఫ్రిది(Afridi).. రోజుకో ఛానెల్‌తో మాట్లాడుతూ.. భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. భారత్‌లో పటాకులు కాల్చినా పాకిస్థాన్‌నే నిందిస్తారని సెటైర్లు పేల్చాడు. ‘భారత్‌లో పటాకులు కాల్చిన పాకిస్థానే కారణమంటారు. కశ్మీర్‌లో 8 లక్షల మంది భారత సైనికులు ఉన్నారు. అయినా ఉగ్రదాడి(Terror Attack) చోటు చేసుకుందంటే.. వారి వైఫల్యం స్పష్టంగా అర్థమవుతోంది. వారి చేతకాని తనం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు భద్రత కల్పించడంలో భారత సైన్యం విఫలమైంది.” అని ఆఫ్రిది వ్యాఖ్యానించారు.

    కాగా.. ‘ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే భారత మీడియా(Indian media) పాకిస్థాన్‌పై నిందలు మోపడం ప్రారంభించింది. భారత మీడియా మాటలు నాకు నవ్వును తెప్పించాయి. భారత స్టార్ క్రికెటర్లు(Indian Star Cricketers) కూడా పాకిస్థాన్‌ను నిందిస్తున్నారు. అసలు క్రీడలకు రాజకీయాలకు ఏం సంబంధం’ అని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలు చేశారు.

    READ ALSO  ENG vs IND Match | ఉత్కంఠ‌గా మారిన తొలి టెస్ట్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్

    Latest articles

    Bhikkanoor | ఘనంగా బోనాల ఊరేగింపు

    అక్షరటుడే, భిక్కనూరు: Bhikkanoor | ఆషాఢమాసం సందర్భంగా భిక్కనూరులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను...

    Ashada masam | దోషాలను హరించే స్కంద పంచమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashada masam | ఏటా ఆషాఢ మాసం(Ashada masam)లో వచ్చే శుక్ల పక్ష పంచమిని...

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    More like this

    Bhikkanoor | ఘనంగా బోనాల ఊరేగింపు

    అక్షరటుడే, భిక్కనూరు: Bhikkanoor | ఆషాఢమాసం సందర్భంగా భిక్కనూరులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను...

    Ashada masam | దోషాలను హరించే స్కంద పంచమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ashada masam | ఏటా ఆషాఢ మాసం(Ashada masam)లో వచ్చే శుక్ల పక్ష పంచమిని...

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...