అక్షరటుడే, వెబ్డెస్క్: Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై (Attack On Mallanna Office) జాగృతి నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. క్యూ న్యూస్ కార్యాలయంలో ఆయనపై దాడికి పాల్పడటంతో మల్లన్న చేతికి స్వల్పంగా గాయమైంది. అంతేగాకుండా గన్మన్పై కూడా జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్సీ కవితపై ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలతోనే జాగృతి నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
Teenmar Mallanna | మీడియా సంస్థలపై వరుస దాడులు
తెలంగాణలో మీడియా సంస్థల(Media Houses)పై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కేటీఆర్కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల మహాన్యూస్ (Maha News)పై దాడి చేశారు. అంతేగాకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కూడా దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. తాజాగా జాగృతి కార్యకర్తలు (Jagruthi Workers) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) క్యూ న్యూస్ (Q News) ఆఫీస్పై దాడి చేయడం గమనార్హం.
Teenmar Mallanna | బీసీ రిజర్వేషన్లపై వ్యాఖ్యలతో..
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకు వస్తామని మంత్రివర్గంలో తీర్మానం చేసింది. అయితే ఇది తమ విజయమని ఎమ్మెల్సీ కవిత ఇటీవల సంబరాలు చేసుకున్నారు. కవిత సంబరాలపై ఎమ్మెల్సీ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు, బీసీలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఆమె ఎందుకు రంగు పూసుకుంటుందన్నారు. అంతేగాకుండా ఆమెకు బీసీలతో కంచంలో పొత్తు ఉందా అనడంతో పాటు.. మరో అసభ్యకరమైన వ్యాఖ్య చేశారు. దీంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
Teenmar Mallanna | గన్ లాక్కునే ప్రయత్నం: మల్లన్న
దాడి అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. 20 నుంచి 30 మంది జాగృతి నాయకులు తనపై దాడి చేయడానికి వచ్చారన్నారు. సిబ్బందితో పాటు కార్యాలయంలో ఉన్న ప్రజలపై సైతం దాడి చేశారని చెప్పారు. కల్వకుంట్ల సుజిత్ రావు (Kalvakuntla Sujith Rao) అనే వ్యక్తి తన గన్మన్ వద్ద గన్ లాక్కొని తనపై కాల్పులు జరపాలని చూశాడన్నారు. ఆఫీస్లో విధ్వంసం సృష్టించడంతో మరో గన్మన్ గాల్లోకి కాల్పులు జరిపాడన్నారు. దీంతో వారు భయపడి పారిపోయారని చెప్పారు.
Teenmar Mallanna | కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు
తీన్మార్ మల్లన్న గన్మన్ జరిపిన కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని రాచకొండ సీపీ సుధీర్బాబు (Rachakonda CP Sudheer Babu) తెలిపారు. ఇరువర్గాల తోపులాటలో ఆఫీస్ అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. అవి గుచ్చుకోవడంతో కొందరికి గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ దాడిలో మల్లన్న చేతికి గాయం అయిందన్నారు. జాగృతి కార్యకర్తలను అదుపు చేయడానికి గన్మన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ రెడ్డి మల్లన్న కార్యాలయాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కాల్పులు జరపడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.