ePaper
More
    Homeభక్తిArunachalam | అరుణాచలంలో తెలుగు భక్తుల కష్టాలు

    Arunachalam | అరుణాచలంలో తెలుగు భక్తుల కష్టాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arunachalam | అరుణాచల క్షేత్రానికి (Arunachalam ) నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తారు. గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని తరిస్తారు.

    అయితే అరుణాచలం వెళ్లే వారిలో చాలా మంది తెలుగు రాష్ట్రాలే (Telugu States) వారే ఉంటారు. ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు దేశం నలుమూలల నుంచి అరుణాచలానికి భక్తులు పోటెత్తుతారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సొంత వాహనాలు, ట్యాక్సీలు, రైళ్ళు, బస్సుల్లో వేలాది మంది గిరి ప్రదక్షిణకు వెళ్తుంటారు.

    అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతో ప్రతి పౌర్ణమికి లక్షలాది భక్తులు ఆలయానికి వెళ్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం భారీగా భక్తులు వెళ్తుంటారు. చాలా ఆర్టీసీ డీపోలు ప్రతి పౌర్ణమికి అరుణాచలం ఆలయానికి ప్రత్యేక బస్సులు (Special Buses) సైతం నడుపుతున్నాయి.

    READ ALSO  Bandi Sanjay | టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్​

    Arunachalam | తెలుగు భక్తులపై వివక్ష

    అరుణాచలంలో తెలుగు భక్తుల (Telugu Devotees)పై వివక్ష చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. చాలా రోజులుగా ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. యావత్ దేశం నుంచి భక్తులు వస్తుంటే కేవలం తమిళంలో మాత్రమే అనౌన్స్​మెంట్లు చేస్తున్నారు. ఇతర భక్తులను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

    ఆలయంతో పాటు అక్కడ ఉండే స్థానికులు సైతం తెలుగువారిపై వివక్ష చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల యాదాద్రి (Yadadri) జిల్లాకు చెందిన ఓ భక్తుడిని గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో డబ్బుల కోసం ఇద్దరు హత్య చేసిన విషయం తెలిసిందే. అలాగే చాలా మంది భక్తులను దర్శనాల పేరిట మోసం చేస్తున్నట్లు సమాచారం.

    Arunachalam | వీడియో వైరల్​

    అరుణాచలంలో భక్తుల కష్టాలకు సంబంధించి ఓ యువకుడు తీసిన వీడియో సోషల్​ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. భక్తులను పట్టించుకోవడం లేదని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించాడు. అంతేగాకుండా తమిళంలో ప్రకటనలు చేస్తున్నారని.. అవి అర్థం కాక ఇతర రాష్ట్రాల భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఐదారు గంటల పాటు దర్శనం కోసం క్యూలైన్​లో ఉన్న తర్వాత తమను బయటకు పంపారని ఆరోపించారు. భక్తులు ఆలయ హుండీల్లో డబ్బులు వేయడం ఆపాలని కోరారు.

    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలుగు భక్తులపై వివక్ష ఉన్నది వాస్తవమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అరుణాచలంను సందర్శించడం, నిధులు ఇవ్వడం ఆపాలని కోరుతున్నారు. అలా చేయడంతో అక్కడి ప్రభుత్వానికి తెలుగు భక్తులు బలం తెలుస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించాలని సూచిస్తున్నారు.

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...