ePaper
More
    Homeఅంతర్జాతీయంBalochistan | 24 గంటల్లో 50 దాడులు.. పాకిస్తాన్ కు చుక్కలు చూపుతున్న వేర్పాటువాదులు

    Balochistan | 24 గంటల్లో 50 దాడులు.. పాకిస్తాన్ కు చుక్కలు చూపుతున్న వేర్పాటువాదులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Balochistan | అంతర్గత పోరుతో పాకిస్తాన్(Pakistan) అల్లాడుతోంది. వేర్పాటువాదుల దాడులతో దద్దరిల్లుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army) గెరిల్లా దాడులతో పాకిస్తాన్ కు చుక్కలు చూపుతోంది.

    స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న బలూచ్ వేర్పాటువాదులు.. గత 24 గంటల్లో 50 దాడులకు పాల్పడ్డారు. 27 మందికి పైగా కాల్చి చంపగా, మరి కొందరిని కిడ్నాప్ చేశారు. సుహ్రాబ్ జిల్లా(Sohrab District)లోని గిదార్లోని సైనిక స్థావరంపై జరిగిన దాడి చేసి, 18 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చారు.

    Balochistan | బామ్ పేరిట దాడులు..

    బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్(Balochistan Liberation Front), బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర సాయుధ గ్రూపులు కలిసి ఆపరేషన్ బామ్(Operation Bam) పేరిట దాడులను ఉద్ధృతం చేశాయి. సమన్వయంతో గెరిల్లా దాడులు చేస్తున్నాయి.

    READ ALSO  Viral Video | రేసింగ్ పడవ ముందు భాగంపై 11 ఏళ్ల బాలుడి నృత్యం.. రేయాన్ నృత్యానికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్​

    గత 24 గంటల్లో 17 ప్రభుత్వ, సైనిక స్థావరాలపై దాడి చేసింది. జోబ్ ప్రాంతంలో బస్సులను తనిఖీ చేసిన వేర్పాటు వాదులు.. విధుల నుంచి తిరిగి వస్తున్న తొమ్మిది మంది పంజాబీ ప్రాంతానికి చెందిన వారిని గుర్తించి ఉరి తీశారు. మరో 20 మంది అదృశ్యమయ్యారు. వారిని వేర్పాటు వాదులే అపహరించారని భావిస్తున్నారు.

    Balochistan | ప్రావిన్స్ అంతటా విస్తృత హింస

    కెచ్, ఖరన్, ఖుజ్దార్, కలత్, పంజ్గుర్, వాషుక్, ముసాఖేల్, సిబి, మస్తుంగ్, నసీరాబాద్, క్వెట్టా, చాగై, డేరా బుగ్టితో సహా దాదాపు ప్రతి జిల్లాలో బలూచ్ దాడులు జరిగాయి. పంజాబ్ కేంద్రీకృత భద్రతా కార్యకలాపాల కంటే ఎక్కువగా దాడులు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

    పాకిస్తాన్ ఏర్పడిన నాటి బలూచ్ తిరుగుబాటు కొనసాగుతోంది. ఆ ప్రాంతంపై పాక్ పాలకులు వివక్ష చూపుతుండడం, అభివృద్ధి చేయకపోవడంతో బలూచ్ వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యవస్థాగత అణచివేత, వనరుల దోపిడీ, గ్వాదర్ పోర్ట్, సీపెక్ వంటి మెగా-మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ప్రాంత వాసులు పాక్ పై తిరుగుబాటుకు దిగారు.

    READ ALSO  Ajit Doval | ఆప‌రేష‌న్ సిందూర్‌పై విదేశీ మీడియా దుష్ప్ర‌చారం.. భార‌త్‌కు న‌ష్టమేమీ జరుగ‌లేద‌న్న అజిత్ ధోవ‌ల్‌

    2025 ప్రారంభం నుంచి దాడులను విస్తృతం చేశారు. రైలు హైజాక్లు, బాంబు దాడులతో పాకిస్తాన్ ను కలవరపెడుతున్నారు. ఖుజ్దార్, మస్తుంగ్ వంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.

    మరోవైపు, తిరుగుబాటును అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం(Pakistan Government).. ఆపరేషన్ హెరాఫ్ 2.0(Operation Heref 2.0) సహా ఎన్నోసార్లు యత్నించి విఫలమైంది. జనవరిలో 27 మంది బలూచ్ యోధులను అంతమొందించింది. ఇది మరింత ఆగ్రహానికి కారణమైంది. బాంబు దాడులు, కిడ్నాప్లతో వేర్పాటువాదులు పాకిస్తాన్ పాలకులకు చుక్కలు చూపుతున్నారు.

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...