అక్షరటుడే, వెబ్డెస్క్: TTD | తిరుమల శ్రీవారి దర్శనం Tirumala Darshan కోసం నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ప్రస్తుతం వేసవి సెలవులు summer holidays కావడంతో భక్తుల రద్దీ పెరగనుంది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ vip break darshan ttd దర్శనాల సమయంలో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్న సమయాన్ని ముందుకు జరపడం ద్వారా సామాన్య భక్తులకు మేలు జరుగుతుందని టీటీడీ భావిస్తోంది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో బ్రేక్ దర్శన సమయాలు మార్పు చేయాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు ttd chairman br nayudu సూచించారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం పరిమితం చేయనున్నారు. మే 1 నుంచి జూలై 15వ తేదీ వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.