ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​SSC Notification | ఎస్సెస్సీలో టెన్త్​తో కొలువులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

    SSC Notification | ఎస్సెస్సీలో టెన్త్​తో కొలువులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: SSC Notification | పదో తరగతి విద్యార్హతతో పలు పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్సెస్సీ (10th Class) విద్యార్హతతో 1,075 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే ఇంజినీరింగ్‌ విద్యార్హతతో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టింది. ఆయా పోస్టులకు అర్హతలు, ఎంపిక విధానం తెలుసుకుందామా..

    ఎంటీఎస్‌(MTS), హవల్దార్‌ పోస్టులు మొత్తం : 1,075.
    విద్యార్హత : పదో తరగతి.
    వయసు : 18 నుంచి 27 ఏళ్లలోపువారు అర్హులు.
    వేతనం : రూ. 18 వేలనుంచి రూ. 56,900 వరకు..
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : ఈనెల 24 వరకు. ఫీజు చెల్లించడానికి ఈనెల 25 వరకు గడువుంది. దరఖాస్తులను సవరించుకోవడానికి 29 నుంచి 31వ తేదీ వరకు అవకాశం ఉంది.
    పరీక్ష తేదీ : సెప్టెంబర్‌ 20వ తేదీనుంచి అక్టోబర్‌ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు.
    ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(CBT)తోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాల కోసం https://ssc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

    READ ALSO  New Schools | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 571 పాఠశాలలు

    SSC Notification | ఇంజినీరింగ్‌ పోస్టులు..

    ఎస్సెస్సీ వివిధ శాఖల్లో గ్రూప్‌ బీ(నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) స్థాయిలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
    మొత్తం పోస్టులు : 1,340
    అర్హత : సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌(Engineering) విభాగాలలో డిప్లొమా లేదా డిగ్రీ పాస్‌ అయి ఉండాలి.
    వయో పరిమితి : వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 30 ఏళ్లలోపు వయసువారు అర్హులు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.
    వేతనం : రూ. 35,400 నుంచి రూ. 1.12 లక్షల వరకు.
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : ఈనెల 21వ తేదీ. ఫీజు చెల్లించడానికి గడువు 22 వ తేదీ వరకు ఉంది. దరఖాస్తులను సవరించుకోవడానికి August 1, 2 తేదీలలో అవకాశం ఉంది.
    ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
    పరీక్ష తేదీలు : పేపర్‌ -1ను అక్టోబర్‌ 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. పేపర్‌ -2 వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. వివరాల కోసం https://ssc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

    READ ALSO  KITS College | అధునాతన సాంకేతిక విద్యల సమాహారం.. ఇందూరు కిట్స్ కళాశాల

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....