ePaper
More
    HomeతెలంగాణKTR | రాష్ట్రంలో అరాచక పాలన.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    KTR | రాష్ట్రంలో అరాచక పాలన.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: KTR | రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​(BRS Working President KTR) అన్నారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ఆయన సీఎం రేవంత్​రెడ్డికి సవాల్​ విసిరిన విషయం తెలిసిందే. కేటీఆర్​ మంగళవారం ఉదయం చర్చ కోసం సోమాజిగూడ ప్రెస్​క్లబ్(Somajiguda Press Club)​కు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా ప్రెస్​క్లబ్​ వద్దకు వచ్చారు. దీంతో పోలీసులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా మోహరించారు.

    మరోవైపు బీఆర్ఎస్​ నాయకులు దమ్ముంటే అసెంబ్లీ చర్చకు రావాలని సవాల్​ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్‌ నేతలు పారిపోతున్నారని విమర్శించారు.

    READ ALSO  Kharge Tour | ఖర్గే పర్యటన వేళ కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

    కేటీఆర్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని విరుచుపడ్డారు. కాంగ్రెస్​ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక 600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వారికి నివాళి అర్పించారు. కాంగ్రెస్​ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

    KTR | బేసిక్​ నాలెడ్జ్ లేని సీఎం

    సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)కి బేసిక్​ నాలెడ్జ్ లేదని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. అయినా చర్చకు రావాలని మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో తమకు సవాల్​ విసరడంతో వచ్చామని కేటీఆర్​ పేర్కొన్నారు. 72 గంటల సమయం ఇచ్చి.. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో చర్చకు రావాలని సవాల్​ చేస్తే రేవంత్​రెడ్డి ఢిల్లీ వెళ్లారన్నారు. ఆయన స్థానంలో మంత్రులను కూడా పంపలేదని విమర్శించారు. రేవంత్​రెడ్డికి రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని ఈ రోజు తేలిపోయిందన్నారు.

    READ ALSO  MLC Kavita Podcast | కుటుంబంలో ఎవ‌రం "సంతోషంగా" లేము.. రామ‌న్నతో విభేదాలు వాస్త‌వమే: క‌విత‌

    KTR | తెలంగాణ రైతులకు సున్నం

    సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ రైతులకు(Telangana Farmers) సున్నం పెడుతూ.. కృష్ణ, గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు(Chandrababu Covert) పాలన నడుస్తోందని కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులను ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఆయన తొత్తులు కొత్త మందికి నియామకాలు ఇచ్చి రేవంత్​రెడ్డి మురిసి పోతున్నారన్నారు. రేవంత్​రెడ్డి ఢిల్లీకి బస్తాలు మోసి సీఎం పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు.

    KTR | ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ

    ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే సంక్షేమ పాలన అని ప్రజలు అనుకున్నారని కేటీఆర్​ పేర్కొన్నారు. అయితే అక్రమ నిర్బంధాలు, అణచివేతలు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపించేలా తెలంగాణలో పాలన సాగుతోందన్నారు. సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినా.. అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారన్నారు.

    READ ALSO  Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    Latest articles

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    More like this

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...