ePaper
More
    HomeతెలంగాణSrisailam Project | నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్ట్​.. నేడు తెరుచుకోనున్న గేట్లు

    Srisailam Project | నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్ట్​.. నేడు తెరుచుకోనున్న గేట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల ప్రాజెక్ట్​(Jurala Project)కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ఇప్పటికే జూరాల నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)​కు భారీ ఇన్​ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​కు 1,72,705 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 881 అడుగుల (193.4 టీఎంసీలు) నీరు ఉంది.

    Srisailam Project | ఎగువన ప్రాజెక్ట్​లు ఫుల్​

    కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో కర్ణాటక(Karnataka)లో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్ట్​లు నిండాయి. దీంతో వాటి గేట్లను కూడా ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉంటడంతో అధికారులు గేట్లు ఎత్తడానికి సిద్ధం అయ్యారు.

    READ ALSO  Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    Srisailam Project | గేట్లు ఎత్తనున్న ఏపీ సీఎం చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మంగళవారం శ్రీశైలం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల ద్వారా విద్యుత్​ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్​(Nagarjuna Sagar)కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారడం.. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉండటంతో జలాశయం వరద గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తనున్నారు. ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఆయన పూజలు చేస్తారు. అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తారు.

    Srisailam Project | ప్రాజెక్ట్​ చరిత్రలో రికార్డు

    శ్రీశైలం ప్రాజెక్ట్​ గేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్​లో ఎత్తుతారు. ప్రాజెక్ట్​ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది జులై తొలివారంలోనే గేట్లు ఎత్తనుండడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్​ 1981లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు మాత్రమే జులైలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2007లో జులై 23న, 2001లో జులై 28న, 2022లో 23న, 2024లో జులై 29న ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తారు. ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది జులై 8న ప్రాజెక్ట్​ నుంచి నాగర్జున సాగర్​కు నీరు విడుదల చేయనున్నారు. కాగా శ్రీశైలం డ్యాంను ఏపీ నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కేంద్రానికి లేఖ రాసింది. డ్యాం గేట్లు ఇప్పుడే ఎత్తవద్దని కోరింది.

    READ ALSO  BJP state president | దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

    Read all the Latest News on Aksharatoday.in

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...