అక్షరటుడే, హైదరాబాద్ : America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన కుటుంబం సజీవ దహనం అయింది. ఒళ్లు గగొర్పొడిచే ఈ ఘటన గ్రీన్కౌంటీ (Green County) ఏరియాలో చోటు చేసుకుంది. కారును భారీ ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
America : అట్లాంటా నుంచి డల్లాస్ వెళ్తుండగా..
ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా వెంకట్, తేజస్విని దంపతులు మృతి చెందారు. వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని నలుగురు కూడా సజీవ దహనం అయ్యారు. అట్లాంటా (Atlanta) నుంచి డల్లాస్(Dallas) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
America : మొత్తం బూడిదగా మారి..
బాధిత కుటుంబం డల్లాస్లో నివసిస్తున్నట్లు సమాచారం. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. దీంతో వాటి ఆనవాళ్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. తదుపరి మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్లోని వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆహ్లాదంగా విహారానికి వెళ్లి, బంధువులతో సరదాగా గడిపి.. తిరిగి వెళ్తుండగా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.