ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | ట్రేడ్‌ డీల్‌ ముందు అనిశ్చితి.. రోజంతా కొనసాగిన ఊగిసలాట.. చివరికి ఫ్లాట్‌గా...

    Stock Markets | ట్రేడ్‌ డీల్‌ ముందు అనిశ్చితి.. రోజంతా కొనసాగిన ఊగిసలాట.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | అమెరికా, భారత్‌ మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) ఈ రోజు ప్రకటించే అవకాశాలు ఉండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 34 పాయింట్లు, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో ట్రేడిరగ్‌ ప్రారంభించాయి.

    సెన్సెక్స్‌ 83,262 నుంచి 83,516 పాయింట్ల మధ్య, నిఫ్టీ(Nifty) 23,407 నుంచి 23,489 పాయింట్ల మధ్య కదలాడాయి. సూచీలు రోజంతా స్వల్ప లాభనష్టాలతో కొనసాగడం గమనార్హం. చివరికి సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 83,442 వద్ద, నిఫ్టీ క్రితం ట్రేడిరగ్‌ సెషన్‌ స్థాయి అయిన 25,461 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌తోపాటు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో రూపాయి(Rupee) మారకం విలువపై ఒత్తిడి నెలకొంది. దీంతో 20 పైసలవరకు తగ్గింది. భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిని ఈరోజు రాత్రి ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

    READ ALSO  Today gold price | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,707 కంపెనీలు లాభపడగా 2,364 స్టాక్స్‌ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 156 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 59 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 16 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Markets | మిశ్రమంగా సూచీలు

    ప్రధాన సూచీలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 1.50 శాతం పెరగ్గా.. యుటిలిటీ 0.71 శాతం లాభపడిరది. టెలికాం సూచీ 1.24 శాతం, ఐటీ 0.74 శాతం, కమోడిటీ 0.66 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.60 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.44 శాతం నష్టపోయాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.01 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.33 శాతం, మిడ్‌ క్యాప్‌ 0.15 శాతం నష్టాలతో ముగిశాయి.

    READ ALSO  Travel Food Services | పబ్లిక్‌ ఇష్యూకు ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్.. రేపే సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    Stock Markets | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో 18 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌ 3.01 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.07 శాతం, ట్రెంట్‌ 0.94 శాతం, రిలయన్స్‌ 0.90 శాతం, ఐటీసీ 0.87 శాతం లాభపడ్డాయి.

    Stock Markets | Top losers..

    బీఈఎల్‌ 2.46 శాతం, టెక్‌ మహీంద్రా 1.83 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.28 శాతం, మారుతి 1.07 శాతం, ఎటర్నల్‌ ఒక శాతం నష్టపోయాయి.

    Latest articles

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    More like this

    RCB | స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ.. బ్రాండ్ వాల్యూ అమాంతం అంత పెరిగిందేంటి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :RCB | ఇన్నాళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ(IPL Trophy)ని ఎట్ట‌కేల‌కు...

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections)...

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ...