ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | గుంతల రోడ్డు.. వరినాట్లు వేసి నిరసన

    Kamareddy | గుంతల రోడ్డు.. వరినాట్లు వేసి నిరసన

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఓవైపు జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో రహదారులు బాగాలేవని, గుంతల రోడ్డులో వరినాట్లు వేసి ప్రజలు నిరసన తెలిపారు.

    కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం కావడంతో గుంతల్లో నీళ్లు నిండి కనిపించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో గమనించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో వినూత్న నిరసనకు దిగారు. సోమవారం అశోక్ నగర్ కాలనీ (Ashok Nagar Colony) వాసులు రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల వద్ద వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.

    READ ALSO  Google Map | గూగుల్​ మ్యాప్ ఎంత పని చేసింది.. వాగులో పడ్డ కారు

    Kamareddy | ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా..

    ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం (Road Construction) చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భారీ గుంతలతో ప్రమాదాల బారిన పడితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి, మురికి కాల్వలు నిర్మించి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు అర్కల ప్రభాకర్ యాదవ్, కౌన్సిలర్, జగదీష్ యాదవ్, లోలపు శ్రీనివాస్, గంగారం యాదవ్, దినేష్ రెడ్డి, నరేందర్, రాజేష్, శ్రీనివాస్, దేవదాస్, ఎల్లేశ్, కాలనీ మహిళలు పాల్గొన్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 9 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 9 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...