ePaper
More
    HomeజాతీయంPet Rules | కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారా.. ప‌ది మంది అనుమ‌తి తప్ప‌నిస‌రి.. ఎక్కడో తెలుసా..!

    Pet Rules | కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారా.. ప‌ది మంది అనుమ‌తి తప్ప‌నిస‌రి.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pet Rules | పెంపుడు జంతువులను ప్రేమించే వారికి గట్టి షాక్ ఇచ్చింది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(Surat Municipal Corporation). ఇకపై ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే, కేవలం మీకు ఇష్టముండడం సరిపోదు. పొరుగింటి వారి అనుమతి కూడా అవసరం. కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. కుక్క పెంపకం కోసం కనీసం 10 మంది పొరుగువారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (No Objection Certificate) తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిబంధన స్వతంత్ర ఇళ్లకే పరిమితం కాదు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి కూడా. ఆయా భవన సంక్షేమ సంఘం ఛైర్మన్ మరియు కార్యదర్శి నుంచి కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ రెండు ధ్రువపత్రాలను సమర్పించిన తర్వాతనే ఇంట్లో కుక్కను పెంచుకునే హక్కు లభిస్తుంది.

    READ ALSO  US ISKCON temple | అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు.. తీవ్రంగా ప‌రిగణించిన భార‌త్

    Pet Rules | పొరుగువారి అనుమ‌తి త‌ప్పనిస‌రి..

    ఈ కఠినమైన నిర్ణయం వెనుక కారణాన్ని అధికారులు స్పష్టంగా తెలిపారు. మే నెలలో సూరత్‌(Surat)లో జరిగిన ఒక విషాదకర సంఘటనలో ఓ చిన్నారి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ముందస్తు చర్యగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు మున్సిపల్ అధికారులు (Municipal Officers) వెల్లడించారు. ఇప్పటికే ఈ నిర్ణయం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. పెంపుడు జంతు యజమానుల్లో కొందరు దీనిని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది వారి వ్యక్తిగత హక్కులను హరించడమేనంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ఇలాంటి రూల్ మ‌న ద‌గ్గ‌ర కూడా వ‌స్తే బాగుంటుంది క‌దా అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మ‌న ద‌గ్గ‌ర కూడా చాలా మంది కుక్కకాటు బారిన ప‌డ్డారు. వీధుల్లో తిరిగే కుక్క‌లే కాకుండా పెంపుడు కుక్కలు కూడా గాయ‌ప‌రుస్తున్నాయి. కుక్క‌ల వ‌ల‌న చాలా గొడ‌వ‌లు అయ్యాయి. కోర్టుల‌కు పోయిన సంద‌ర్భాలు కూడా లేక‌పోలేదు. ఏదిఏమైనా సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశమైంది.

    READ ALSO  Padmanabha Swamy temple | సీక్రెట్ కెమెరాలున్న క‌ళ్ల‌ద్దాలు ధరించి ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యంలోకి.. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...