ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక...

    Operation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ రాహుల్‌ ఆర్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాలను యుద్ధ రంగంలో ఓడించామని ఆయన తెలిపారు. ఫిక్కి నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ (New Age Military Technologies) కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

    జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూరు(Operation Sindoor) చేపట్టి పాక్​, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్​ దెబ్బతో షాకైన పాక్​ తర్వాత డ్రోన్లు, క్షిపణులతో భారత్​పై దాడులు చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను అడ్డుకుంది.

    READ ALSO  Social Accounts ban | పాక్ న‌టుల సోష‌ల్ అకౌంట్ల‌పై మ‌ళ్లీ నిషేధం

    Operation Sindoor | ఆ దేశాలను ఓడించాం

    ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాకిస్తాన్​(Pakistan)కు తుర్కీయే డ్రోన్లను సరఫరా చేసింది. చైనా కూడా ఆయుధాలు అందించినట్లు సమాచారం. పాక్​ పలు చైనా క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తాజాగా రాహుల్‌ ఆర్‌సింగ్‌(Rahul R Singh) మాట్లాడుతూ.. పాక్‌తో పాటు చైనా, తుర్కియేను ఓడించామన్నారు.
    చైనా పాకిస్తాన్‌ను లైవ్‌ ల్యాబ్‌లా వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్​ ప్రయోగించిన పలు చైనా మిసైళ్లు(Chinese Missiles) పని లక్ష్యాన్ని చేరుకోకముందే కూలిపోయాయి. అలాగే చైనా నుంచి పాక్​ కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత దాడులను అడ్డుకోలేకపోయింది. అదే సమయంలో భారత్​ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 సిస్టమ్​ సమర్థవంతంగా పని చేసింది. ఈ క్రమంలో డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు చేశారు. తుర్కియే పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా పాకిస్తాన్‌కు ప్రత్యక్ష కార్యాచరణ డేటాను అందించిందని, భారత్​పై నిఘా ఉంచిందని ఆయన తెలిపారు.

    READ ALSO  Delhi | ఇంధనం నిలిపివేతపై ఢిల్లీ సర్కారు యూ టర్న్​.. వారికి ఇక ఉపశమనం

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...