అక్షరటుడే, వెబ్డెస్క్:Mahesh Babu | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులకు హీరో మహేశ్ బాబు లేఖ రాశారు. షూటింగ్(Shooting) కారణంగా విచారణకు రాలేనని పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ ఇవ్వాలని లేఖలో ఈడీ(ED)ని కోరారు. సాయిసూర్య డెవలపర్(Saisurya Developer) కేసులో మహేశ్బాబును ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
Mahesh Babu | సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్గా మహేశ్బాబు
సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ మనీ లాండరింగ్(Money Laundering)కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి మహేశ్బాబు బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador)గా ఉన్నారు. కంపెనీ తరఫున ప్రమోషన్ చేసి ప్రజలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని మహేశ్ బాబు(Mahesh Babu)కు ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. కాగా.. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీలకు ప్రమోషన్స్ promotions చేసేందుకు మహేశ్ బాబు రూ.5.90 కోట్లు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.