ePaper
More
    HomeతెలంగాణPashamylaram Incident | తీరని వేదన.. తమ వారి కోసం సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల...

    Pashamylaram Incident | తీరని వేదన.. తమ వారి కోసం సిగాచి పరిశ్రమ వద్ద బాధితుల నిరీక్షణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram Incident | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో (Sigachi factory) పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పొట్ట చేతపట్టుకొని పనిచేయడానికి వచ్చిన కార్మికులను బతుకులను బుగ్గిపాలు చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 40 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు సహాయక చర్యలు (rescue operations) చేపడుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ వద్ద దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తమ వారి కోసం పలువురు పరిశ్రమ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు.

    Pashamylaram Incident | పోలీసులు కాళ్లు పట్టుకున్న ఓ తండ్రి

    చేతికొచ్చిన కొడుకు పరిశ్రమలోని పనికి వెళ్లి తిరిగి రాలేదు. ఆ తండ్రి తమ కుమారుడి ఆచూకీ తెలపాలని పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. సిగాచి ఫ్యాక్టరీలో (Sigachi factory) జస్టిన్ (22) ఉద్యోగంలో చేరిన మూడు రోజులకు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జస్టిన్​ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆ తండ్రి కంపెనీ వద్ద నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. తన కుమారుడి ఆచూకీ చెప్పాలని రాందాస్​ అధికారులను వేడుకుంటున్నాడు.

    READ ALSO  pashamylaram | ‘సిగాచి’ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

    Pashamylaram Incident | హెల్ప్​ డెస్క్ ఏర్పాటు

    పేలుడు ఘటనలో 40 మృతి చెందారు. అయితే పేలుడు దాటికి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. దీంతో డీఎన్​ఏ పరీక్షలు (DNA tests) చేసి కుటుంబ సభ్యులకు (family members) మృతదేహాలు అప్పగించారు. మరోవైపు పలువురి ఆచూకీ లభించకపోవడంతో అధికారులు పటాన్​చెరు ఆస్పత్రి (Patancheru Hospital) వద్ద హెల్ప్​ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆచూకీ దొరకని వారి వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు రోజులు అవుతున్నా తమవారి జాడ లేక కుటుంబ సభ్యుల ఆవేదన చెందుతున్నారు. కాగా.. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...