అక్షరటుడే, వెబ్డెస్క్:Osmania Hospital | ఉస్మానియా జనరల్ ఆస్పత్రి osmania hospital వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే ప్రభుత్వ మొట్టమొదటి సారి పేగు మార్పిడి(Intestinal Transplant) ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వైద్య బృందాన్ని అభినందించారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. మన రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమైన క్షణమని వైద్యులు, సిబ్బంది బృందాన్ని కొనియాడారు.
Osmania Hospital | 40 ఏళ్ల రోగికి శస్త్ర చికిత్స
షార్ట్ గట్ సిండ్రోమ్(Short Gut Syndrome)తో బాధపడుతున్న 40 ఏళ్ల రోగికి వైద్యులు ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు సమాచారం. లిక్విడ్ ఆహారాన్ని సైతం తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఇది తెలంగాణ(Telangana)లో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులలో మొట్టమొదటి విజయవంతమైన పేగు మార్పిడి ఆపరేషన్ (Intestinal Transplant Operation), అలాగే భారతదేశంలోని మొత్తం ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ రంగంలో మొదటి కేసు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది(Osmania Hospital Staff)ని అభినందించారు.