ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | భారత్​కు అమెరికా హెచ్చరిక..! రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం సుంకం!

    America | భారత్​కు అమెరికా హెచ్చరిక..! రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం సుంకం!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: America : భారత్​(BHARATH)టు, చైనా(CHINA)కు అమెరికా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. రష్యా (Russia) తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ అ​ధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో సెనెట్​లో బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం Senator Lindsey Graham ఈ విషయాలు వెల్లడించారు.

    ‘రష్యా నుంచి చమురును భారత్, చైనా 70 శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇలాంటి దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధించేలా చర్యలు తీసుకుంటాం’ అని లిండ్సే వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ విధమైన బిల్లును ఆగస్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఈ విధమైన బిల్లుకు ట్రంప్ సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు.

    READ ALSO  The America Party | అన్నంత ప‌ని చేసిన ఎలాన్ మ‌స్క్.. అమెరికాలో కొత్త రాజ‌కీయ పార్టీ

    America : ఆర్థికంగా దెబ్బతీసేందుకేనా..

    అగ్ర రాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ కలిగిన ఆమెరికా.. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. దీనికి అధ్యక్షుడు ట్రంప్ వంత పాడటం యూఎస్​కు కలిసొస్తోంది. ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సెనెటర్​ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటున్నారు.

    రష్యా నుంచి భారత్​, చైనా పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా సెనెటర్​ చెప్పిన బిల్లు అమల్లోకి వస్తే.. ఈ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్​ ఔషధాలు, వస్త్రాల వంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావమే పడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉక్రెయిన్ కు అండగా ఉంటూ వస్తున్న యూఎస్​.. ఆ దేశానికి మద్దతు తెలిపే రాజ్యాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు ప్రచారంలో ఉంది.

    READ ALSO  Rahul Gandhi | ట్రంప్ ఒత్తిళ్ల‌కు మోదీ త‌లొగ్గుతారు.. వాణిజ్య ఒప్పందంపై రాహుల్‌గాంధీ ఆరోప‌ణ‌

    America : తక్కువ సుంకాలతో ఒప్పందం..!

    ఇదిలా ఉంటే.. యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. త్వరలో భారత్​తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. చాలా తక్కువ సుంకాలతో ఈ ఒప్పందం ఉండనున్నట్లు పేర్కొన్నారు. కాగా, భారత్ ఇంకా దీనికి తమ అంగీకారం తెలపలేదన్నారు. వారు ఒప్పుకొంటే తక్కువ సుంకాలు విధించేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్​ చెప్పుకొచ్చారు. కాగా, జులై 9వ తేదీ లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...