More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. జుక్కల్​ నియోజకర్గంలో (Jukkal Constituency) రూ. 6.82 కోట్లతో పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తాను గెలవగానే ముందుగా గ్రామాల్లో రోడ్లను బాగుచేస్తానని హామీ ఇచ్చానని.. ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానన్నారు. నియోజకవర్గంలో సీ.సీ రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.33 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు.

    Mla Laxmi Kantha Rao | ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు..

    అదేవిధంగా ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు వేయించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. గత పాలకులు చేయలేని అసాధ్యమైన పనులు కూడా చేపడుతున్నామని అన్నారు. అసమర్థ నాయకుల వల్ల ఆగిపోయిన లెండి, నత్తనడకన సాగుతున్న నాగమడుగు ప్రాజెక్టుల (Nagamadugu Project) పనులు నేడు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu)నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, ఇక ముందు కూడా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

    READ ALSO  Jurala Project | జూరాల ప్రాజెక్ట్​కు పొంచి ఉన్న ముప్పు

    Mla Laxmi Kantha Rao | రైతు బాంధవుడు సీఎం రేవంత్​రెడ్డి..

    రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) గారు ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా (Rythu Barosa) నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి అన్నదాతకు అండగా నిలిచాడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ దుకాణాల్లో ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని, పేదలందరూ మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు.కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు.

    READ ALSO  Nizamsagar project | ‘సాగర్’​కు పూడిక ముప్పు

    Latest articles

    Sangareddy | రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌.. 37కు చేరిన మృతుల సంఖ్య‌.. నేడు పాశ‌మైలారంనకు సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం (Pashamilaram)లో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi...

    TUWJ – IJU | టీఈఎంఏ జిల్లా కమిటీ ఎంపిక.. కార్యవర్గ సభ్యులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు: TUWJ - IJU : టీయూ డబ్ల్యూజే - ఐజేయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్...

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో...

    Train tickets | పెరిగిన రైల్వే ఛార్జీలు.. నేటి నుండి అమ‌ల్లోకి.. ఎంత పెరిగాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Train tickets : దాదాపు ఐదేళ్ల తర్వాత భారత రైల్వే శాఖ IRCTC ప్రయాణికులపై ఛార్జీల...

    More like this

    Sangareddy | రియాక్ట‌ర్ పేలుడు ఘ‌ట‌న‌.. 37కు చేరిన మృతుల సంఖ్య‌.. నేడు పాశ‌మైలారంనకు సీఎం రేవంత్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru) మండలం పాశమైలారం (Pashamilaram)లో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi...

    TUWJ – IJU | టీఈఎంఏ జిల్లా కమిటీ ఎంపిక.. కార్యవర్గ సభ్యులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు: TUWJ - IJU : టీయూ డబ్ల్యూజే - ఐజేయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్...

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో...