More
    HomeజాతీయంGST Collections | జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఐదేళ్లలో డబుల్​ అయిన కలెక్షన్లు

    GST Collections | జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. ఐదేళ్లలో డబుల్​ అయిన కలెక్షన్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: GST Collections | దేశంలో గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో జీఎస్టీ (GST) వసూలైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వసూళ్ల (GST Collections) వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఏకంగా రూ.22.08 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు కావడం గమనార్హం.

    కేంద్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో బీజేపీ (BJP) దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017 జులై 1న గతంలో ఉన్న బహుళ పన్ను వ్యవస్థలో స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్​టీ(గూడ్స్​ సర్వీస్​ ట్యాక్స్​) అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి అన్ని రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుంది. అయితే పెట్రోల్​, మద్యంను మాత్రం ఇందులో నుంచి మినహాయించారు. తొలి ఏడాది రూ.10.79 లక్షల కోట్ల జీఎస్టీ వచ్చింది.

    READ ALSO  TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    GST Collections | ఐదేళ్లలో ఎంతో పురోగతి

    2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.11.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. 2024–25లో ఆ మొత్తం రూ.22.08 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే ఐదు ఏళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి నమోదు అయింది. కరోనా (Corona) సమయంలో తప్ప ప్రతి సారి జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ పోవడం గమనార్హం. 2025 ఏప్రిల్​లో రూ.2.37 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. మే నెలలో రూ.2.01 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చాయి.

    GST Collections | జీఎస్టీ వసూళ్ల వివరాలు..

    • 2017–18 : రూ.10.79 లక్షల కోట్లు
    • 2018–19 : రూ.11.77 లక్షల కోట్లు
    • 2019–20 : రూ.12.22 లక్షల కోట్లు
    • 2020–21 : రూ.11.91 లక్షల కోట్లు
    • 2021–22 : రూ.14.83 లక్షల కోట్లు
    • 2022–23 : రూ.18.08 లక్షల కోట్లు
    • 2023–24 : రూ.20.18 లక్షల కోట్లు
    • 2024–25 : రూ.22.08 లక్షల కోట్లు
    READ ALSO  Railway Passengers | ఆర్వోబీ వద్ద విరిగిన క్లస్టర్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    GST Collections | పెరిగిన పన్ను చెల్లింపుదారులు

    దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల (Tax Payers) సంఖ్య పెరిగింది. 2017లో పన్ను చెల్లింపుదారులు 65 లక్షల మంది ఉండగా 2025 నాటికి వారి సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది.

    Latest articles

    Agni-5 | అత్యాధునిక బంకర్​ బస్టర్​పై డీఆర్​డీఓ కసరత్తు.. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి కొత్త వేరియంట్‌ అభివృద్ధి!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 : భారత సైనిక సామర్థ్యాలకు గణనీయమైన ముందడుగు పడుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ...

    Vizag Glass Bridge | విశాఖకు స‌రికొత్త ఆకర్షణ.. కైలాసగిరిలో భారతదేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vizag Glass Bridge | ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పర్యాటక రంగం అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం అనేక...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 1 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – ఆషాఢపక్షం...

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    More like this

    Agni-5 | అత్యాధునిక బంకర్​ బస్టర్​పై డీఆర్​డీఓ కసరత్తు.. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి కొత్త వేరియంట్‌ అభివృద్ధి!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 : భారత సైనిక సామర్థ్యాలకు గణనీయమైన ముందడుగు పడుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ...

    Vizag Glass Bridge | విశాఖకు స‌రికొత్త ఆకర్షణ.. కైలాసగిరిలో భారతదేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vizag Glass Bridge | ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పర్యాటక రంగం అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం అనేక...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 1 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – ఆషాఢపక్షం...