అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rains | ఉత్తరాదిలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్(Uttarakhand), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరదల దాటికి ఇప్పటికే ఉత్తరాఖండ్లో పలువరు గల్లంతయ్యారు. తాజాగా హిమాచల్ప్రదేశ్లోని ఓ ఐదు అంతస్తుల భవనం వరదల దాటికి పేకమేడలా కూలిపోయింది.
Heavy Rains | తప్పిన ప్రమాదం
ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్ రాజధాని సిమ్లా(Simla)లో వర్షాలతో సోమవారం ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో ఆ భవనంలోని వారు ఖాళీ చేయించారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Heavy Rains | చార్ధామ్ యాత్ర భక్తుల ఇబ్బందులు
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర(Chardham Yatra)కు వెళ్లిన భక్తులు వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం భారీ వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 24 గంటల పాటు యాత్రను అధికారులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే రహదారిని పునరుద్ధరించిన అధికారులు సోమవారం యాత్రను పున: ప్రారంభించారు. కానీ నిత్యం భారీ వర్షాలు పడుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు.