అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఎన్సీసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎంబీబీఎస్లో (MBBS) ఒక్కశాతం ఎన్సీసీ కోటా రిజర్వేషన్ను గతంలో తీసివేశారని పేర్కొన్నారు. తిరిగి రిజర్వేషన్ కల్పించాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బయటికి పంపించేశారు. ఎన్సీసీ విద్యార్థులంతా వరంగల్ నుంచి వచ్చినట్లు తెలిసింది.