అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ (Operation kagar) ఆపేయాలని, లేకపోతే మరికాసేపట్లో చంపేస్తామని ఓ అగంతకుడు ఎంపీకి ఫోన్ చేశాడు. తమ బృందాలు హైదరాబాద్లో (Hyderabad) ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సదరు వ్యక్తి సవాల్ విసిరడం గమనార్హం.
రెండు రోజుల క్రితం సైతం ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. జూన్ 23న తొలిసారి ఫోన్ చేసిన దుండగులు చంపేస్తామని బెదిరించారు. ఆపరేషన్ కగార్ (Operation Kagar) ఆపాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. తాను మధ్యప్రదేశ్కు (Madhya Pradesh) చెందిన మావోయిస్ట్గా అగంతకుడు చెప్పడం గమనార్హం. కాగా రెండు నంబర్ల నుంచి రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
MP Raghunandan Rao | భద్రత పెంపు
ఎంపీ రఘునందన్ రావుకు (MP Raghunandan Rao) జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టి ఆయనకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఎంపీ పర్యటనలో ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఏ మేరకు డీజీపీ నుంచి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సిద్దిపేట సీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు ఆదేశాలు అందాయి. అయితే మరోసారి ఆయనకు బెదిరింపు కాల్ రావడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.