అక్షరటుడే, వెబ్డెస్క్: DS Statue | పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్(డీఎస్)విగ్రహాన్ని నిజామాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఎంపీ అర్వింద్ (MP Arvind) తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా.. ప్రథమ వర్ధంతి సందర్భంగా అమిత్ షాతో ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే డీఎస్ విగ్రహ (DS statue) ఆవిష్కరణపై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్చాట్లో మాట్లాడారు.
DS Statue | డీఎస్ కాంగ్రెస్ మనిషి
డీఎస్ కాంగ్రెస్ మనిషని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ (PCC President Mahesh Goud) అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను డీఎస్ వ్యతిరేకంగించారని పేర్కొన్నారు. అలాంటిది ఆయన విగ్రహావిష్కరణకు అమిత్ షాను పిలవడమేమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చొరవతోనే డీఎస్ విగ్రహం ఏర్పాటు అయ్యిందన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డిని పిలవకపోవడంపై ఆయన ప్రశ్నించారు.
డీఎస్ విగ్రహాన్ని (DS statue) అమిత్ షా ఆవిష్కరిస్తే ఆయన ఆత్మ బాధ పడుతుందని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. డీఎస్ ఏనాడు బీజేపీ వైపు చూడలేదన్నారు. అలాంటిది ఆయన విగ్రహాన్ని అమిత్ షాతో ఆవిష్కరింపజేయడం ఏమిటన్నారు.