More
    HomeతెలంగాణTurmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​...

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Union Minister) అన్నారు. నిజామాబాద్ (Nizamabad)​ నగరంలో పసుపు బోర్డు (Turmeric Board) కార్యాలయం ప్రారంభించిన అనంతరం పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ (PM Modi) హామీ ఇచ్చారన్నారు. మోదీ మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. బోర్డు ఏర్పాటుతో ఇక ఎప్పటికీ పసుపు రేటు పడిపోదని అమిత్​ షా పేర్కొన్నారు.

    Turmeric Board inauguration | ఎగుమతుల కోసం ప్రత్యేక చర్యలు

    పసుపు బోర్డు ద్వారా మార్కెటింగ్​ సౌకర్యాలు మెరుగు పరుస్తామన్నారు. పసుపు మార్కెటింగ్​, ఎగుమతుల కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు నాలుగు సంవత్సరాల్లోనే నిజామాబాద్​ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ఆర్గానిక్​ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్​కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. భారత్​ ఆర్గానిక్​ కో ఆపరేటివ్​ లిమిటెడ్ (Bharat Organic Cooperative Limited)​, భారత్​ కో ఆపరేటివ్​ ఎక్స్​పోర్ట్​ లిమిటెడ్ (Bharat Cooperative Export Limited)​ శాఖలు నిజామాబాద్​లో ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా పసుపు ఎగుమతులు పెంచుతామని అమిత్​ షా పేర్కొన్నారు.

    READ ALSO  Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..: ఏలేటి మహేశ్వర్​ రెడ్డి

    Turmeric Board inauguration | పాకిస్తాన్​కు దీటైన జవాబు ఇచ్చాం

    ఉరి, పుల్వామా, పహల్​గామ్​ దాడులకు దీటైన బదులు ఇచ్చామని అమిత్​ షా తెలిపారు. పదేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్​పై భారత్​ దాడి చేసిందని చెప్పారు. సర్జికల్​ స్ట్రైక్​, ఎయిర్​ స్ట్రైక్​ చేశామని గుర్తు చేశారు. ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) ద్వారా పాకిస్తాన్​ గడ్డపైకి వెళ్లి దాడి చేశామన్నారు. పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల హెడ్​ క్వార్టర్లను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. అంతేకాకుండా కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టిందని పేర్కొన్నారు. కానీ రాహుల్​ గాంధీ ఆధారాలు అడుగుతున్నారన్నారు. పాకిస్తాన్​ మాట రాహుల్​ గాంధీ నోట వస్తోందన్నారు.

    Turmeric Board inauguration | 2026లో నక్సల్స్​ ముక్త్​ భారత్​

    దేశంలో 2026 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని అమిత్​ షా స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అభివృద్ధిని నక్సలిజం అడ్డుకుంటోందన్నారు. మావోయిస్టులను అంతం చేయాలా వద్దా మీరే చెప్పండి అని అడిగారు. మావోయిస్టులు వెంటనే హత్యాకాండ విడిచి తక్షణం లొంగిపోవాలని సూచించారు. దేశ భద్రతను మోదీ పటిష్టం చేస్తున్నారని పేర్కొన్నారు.

    READ ALSO  DSP Transfers | పలువురు డీఎస్పీల బదిలీ

    Turmeric Board inauguration | కోట్లు కొల్లగొట్టిన బీఆర్​ఎస్​

    బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగిందని అమిత్​ షా అన్నారు. ధరణి, కాళేశ్వరం, సింగరేణి నియామకాలు, టీఎస్​పీఎస్సీ పేరిట కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. బీఆర్​ఎస్​ అవినీతి వద్దనుకొని ప్రజలు కాంగ్రెస్​కు అధికారం అప్పగించారన్నారు. కానీ రేవంత్​రెడ్డి ప్రభుత్వం బీఆర్​ఎస్​ అవినీతిపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రస్తుతం రేవంత్​ సర్కారు కూడా అవినీతి మయంగా మారిందని విమర్శించారు. గతంలో తెలంగాణ బీఆర్​ఎస్​కు ఏటీఎంగా ఉండేదని, ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్రంలో అధికారం మారినా అవినీతి మారలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని పేర్కొన్నారు.

    Latest articles

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...

    Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం...

    More like this

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway...

    Cricketer | సిక్స్ కొట్టి మైదానంలో కుప్పకూలిన యువ క్రికెటర్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cricketer : గుండెపోటు(Heart attack) ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇచ్చే...

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్ళను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ...