అక్షరటుడే, వెబ్డెస్క్ : Jagadish Reddy | కేసీఆర్ క్షమించినా.. తాము మాత్రం ఎల్లో మీడియాను వదిలిపెట్టమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి (Jagadish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని మహా న్యూస్ (Maha News) ఆఫీస్పై కొందరు బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు శనివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై జగదీశ్రెడ్డి స్పందించారు. మహాన్యూస్పై దాడి జరగ్గానే.. చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గం, తెలంగాణలో ఆయన శిష్యులు హడావుడి చేస్తున్నారన్నారు.
Jagadish Reddy | కార్యకర్తలు ఊరుకోరు
తెలంగాణ కొందరు మీడియా హౌస్ల పేరిట స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) వ్యక్తిత్వాన్ని చంపేలా వార్తలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్పై దాడి చేస్తే కార్యకర్తలు చూస్తు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. మహాన్యూస్పై జరిగింది దాడి కాదని.. అది నిరసన మాత్రమే అని ఆయన అన్నారు. తాము దాడులు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు.
Jagadish Reddy | వెతికి పట్టుకొని పని చేస్తాం
మీడియా ముసుగులో తప్పుడు వార్తలు ప్రచురించే వారిని వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు. బిన్ లాడెన్ను వెతికినట్లు వెతికి పట్టుకొని వారి పని చేస్తామన్నారు. అలాంటి వారిని ఎవరికి కాపాడలేరని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా న్యూస్ కాకుండా ఇంకో రెండు, మూడు ఉన్నాయని, వాటి పని కూడా చేస్తామన్నారు.