అక్షరటుడే, వెబ్డెస్క్: Turmeric Board inauguration | కేంద్ర హోం మంత్రి అమిత్షా (Union Home Minister Amit Shah) ఇందూరుకు చేరుకున్నారు. నగరంలోని పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (Turmeric Board central office) ఆదివారం మధ్యాహ్నం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని తిలకించారు.
ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్వా గార్డెన్లో నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ప్రారంభోత్సవ సమావేశానికి తరలివెళ్లారు.
