అక్షరటుడే, వెబ్డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra )ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్ర ప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపేసిన అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు ఆదివారం, సోమవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఈక్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది.
చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ధామ్లతో యాత్ర ప్రారంభం అయింది. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో వేలాది మంది భక్తులు యాత్రకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వర్షాల నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.