అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం (Minister Tummala Nageswara Rao) జిల్లాకు విచ్చేశారు. వీరికి ఇందల్వాయి టోల్గేట్ వద్ద రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) ఘనంగా స్వాగతం పలికారు. సీతక్కను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి, మునిపెల్లి సాయి రెడ్డి, ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Minister seethakka | పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో..
జిల్లా కేంద్రంలో ఆదివారం జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం.. కంఠేశ్వర్ బైపాస్ వద్ద డీఎస్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో రైతుసభ జరుగనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. అనంతరం బస్వా గార్డెన్లో రైతులు, కాంగ్రెస్ నాయకులతో పలు విషయాలపై చర్చించనున్నారు.