అక్షరటుడే, వెబ్డెస్క్ : Kethireddy Pedda Reddy | అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని (Kethireddy Pedda Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది తర్వాత ఆయన తన ఇంటికి రాగా.. తమ అనుమతి లేకుండా వచ్చారని పోలీసులు అరెస్ట్ (Police Arrested) చేసి అదుపులోకి తీసుకున్నారు.
Kethireddy Pedda Reddy | అల్లర్లతో అనుమతి నిరాకరాణ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP assembly elections) అనంతరం తాడిపత్రిలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన ఏడాదిగా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లలేదు. అయితే తనను పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన హైకోర్టును (High Court) ఆశ్రయించారు. దీంతో తాడిపత్రి వెళ్లడానికి ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు కోర్టు ఆదేశాలు (Court Orders) పాటించడం లేదంటూ ఇటీవల ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సడెన్గా ఆయన తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లారు.
Kethireddy Pedda Reddy | అనంతపురం తరలింపు
తాడిపత్రిలోని (Tadipatri) తన ఇంట్లో ఉన్న పెద్దారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో తాను ఉంటే తప్పేంటని పెద్దారెడ్డి వారితో వాగ్వాదం చేశారు. అయినా బలవంతంగా అదుపులోకి తీసుకొని మాజీ ఎమ్మెల్యేను అనంతపురం (Anantapur) తరలించారు. అల్లర్లు జరుగుతాయనే ముందస్తు జాగ్రత్తలతో పెద్దారెడ్డిని పట్టణం నుంచి తీసుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.