అక్షరటుడే, వెబ్డెస్క్: Organs Donation : అవయవదానంతో నలుగురికి ప్రాణం పోశారు ఓ యువ లాయర్. కావలి శివ ప్రసాద్ కుటుంబ సభ్యులు గొప్ప మనుసు చాటారు. పుట్టెడు దుఃఖంలోనూ ఉదారత చాటుకున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బుర్గుపల్లి (Burgupalli, Jadcharla mandal, Mahabubnagar district, Telangana)కి చెందిన కావలి శివ ప్రసాద్(22) లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
కాగా, జూన్ 17, 2025న ఆయన తలపై పదునైన ఆయుధం తగలడంతో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్(Hyderabad)లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)కి తరలించారు. అత్యవసర చికిత్స తర్వాత జూన్ 27, 2025న మధ్యాహ్నం 3:59 గంటలకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు.
దీంతో శివ ప్రసాద్ తండ్రి కె.నర్సింలు తన తనయుడి అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేసి, నలుగురు రోగులకు సాయపడ్డారు.
ఇదే విషయాన్ని ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ X వేదికగా పోస్ట్ చేశారు. పుట్టెడు దు:ఖంలో ఉదారత చాటుకున్న ఆ కుటుంబానికి సెల్యుట్ చేశారు. ఆ కుటుంబ సభ్యులది గొప్ప మనస్సు అని పేర్కొన్నారు.