More
    HomeతెలంగాణAmit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) రానున్న నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

    పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar Bypass)​ వద్ద డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    Amit Shah | పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి

    నిజామాబాద్​ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. ఇప్పటికే బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానీశ్రీని నియమించిన విషయం తెలిసిందే.

    READ ALSO  Sarangapur | సారంగాపూర్ పాఠశాలను సందర్శించిన న్యాయమూర్తి

    Amit Shah | డీఎస్​ విగ్రహావిష్కరణ

    పసపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ విగ్రహాన్ని అమిత్​ షా ఆవిష్కరించనున్నారు. ఈ కాంస్య విగ్రహాన్ని డీఎస్​ తనయుడు, ఎంపీ అర్వింద్​ రూ. 40 లక్షలు వెచ్చించి తయారు చేయించారు. గుజరాత్​లోని సర్దార్​ వల్లభాయ్​ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహాన్ని రూపొందించిన పద్మ భూషణ్ రామ్ సుతార్ (Padma Bhushan Ram Sutar) అనే కళాకారుడు డీఎస్ విగ్రహాన్ని తయారు చేశారు.

    Amit Shah | పాలిటెక్నిక్​ మైదానంలో..

    బైపాస్​ రోడ్డులో డీఎస్​ విగ్రహావిష్కరణ అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సభలో అమిత్​షా పాల్గొని ప్రసంగిస్తారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలు సిద్ధం చేశారు. వర్షం పడినా సభకు అంతరాయం ఏర్పడకుండా భారీ జర్మన్​ సీలింగ్​లు వేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుల సమన్వయంతో సమీక్షించారు.

    READ ALSO  Rythu Bharosa | ఆ జిల్లా రైతులకు పడని రైతు భరోసా.. ఎందుకో తెలుసా?

    Amit Shah | జిల్లాకు రానున్న మంత్రులు సీతక్క, తుమ్మల

    పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క రానున్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం హాజరుకానున్నారు.

    Latest articles

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...

    BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...

    More like this

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...