అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్షా వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) రానున్న నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. కంఠేశ్వర్ బైపాస్ (Kanteshwar Bypass) వద్ద డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Amit Shah | పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. ఇప్పటికే బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానీశ్రీని నియమించిన విషయం తెలిసిందే.
Amit Shah | డీఎస్ విగ్రహావిష్కరణ
పసపుబోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఈ కాంస్య విగ్రహాన్ని డీఎస్ తనయుడు, ఎంపీ అర్వింద్ రూ. 40 లక్షలు వెచ్చించి తయారు చేయించారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహాన్ని రూపొందించిన పద్మ భూషణ్ రామ్ సుతార్ (Padma Bhushan Ram Sutar) అనే కళాకారుడు డీఎస్ విగ్రహాన్ని తయారు చేశారు.
Amit Shah | పాలిటెక్నిక్ మైదానంలో..
బైపాస్ రోడ్డులో డీఎస్ విగ్రహావిష్కరణ అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సభలో అమిత్షా పాల్గొని ప్రసంగిస్తారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలు సిద్ధం చేశారు. వర్షం పడినా సభకు అంతరాయం ఏర్పడకుండా భారీ జర్మన్ సీలింగ్లు వేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుల సమన్వయంతో సమీక్షించారు.
Amit Shah | జిల్లాకు రానున్న మంత్రులు సీతక్క, తుమ్మల
పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రానున్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం హాజరుకానున్నారు.