అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) రానున్న నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. కంఠేశ్వర్ బైపాస్ (Kanteshwar Bypass) వద్ద డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
DS Statue | రూ. 40లక్షలతో కాంస్య విగ్రహం తయారీ
ఎంపీ అర్వింద్ తన సొంత నిధులు రూ. 40లక్షలతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహాన్ని రూపొందించిన పద్మ భూషణ్ రామ్ సుతార్ (Padma Bhushan Ram Sutar) అనే వ్యక్తి డీఎస్ విగ్రహాన్ని తయారు చేశారు. తేదీల ప్రకారం 29న మొదటి వర్ధంతి కావడంతో కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా విగ్రహాన్ని ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
DS Statue | పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి
ఆర్యనగర్లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. ఇప్పటికే బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానీశ్రీని నియమించారు.
DS Statue | పాలిటెక్నిక్ మైదానంలో..
బైపాస్ రోడ్డులో డీఎస్ విగ్రహావిష్కరణ అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటుచేసిన రైతు సభలో అమిత్షా పాల్గొని ప్రసంగిస్తారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలు సిద్ధం చేశారు. వర్షం పడినా సభకు అంతరాయం ఏర్పడకుండా పెద్ద షెడ్డు వేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుల సమన్వయంతో సమీక్షించారు.