అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా (Union Home Minister Amit Shah) పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్ (Octopus), గ్రేహౌండ్స్, స్నీపర్ టీంలతో (Sniper Team) భారీ బందోబస్తు ఏర్పాటు పటిష్టమైన నిఘావ్యవస్థ, బైనాక్యూలర్లతో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 1300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
CP Sai Chaitanya | ముమ్మరంగా తనిఖీలు..
జిల్లా కేంద్రాన్ని పూర్తిగా పోలీసు శాఖ స్వాధీనంలోకి తీసుకుందని సీపీ వివరించారు. స్పెషల్ పార్టీ టీంలు, బీడీ టీంలు, డాగ్ స్వ్కాడ్స్లతో (Dog Squads) బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలను జల్లెడ పట్టామని సీపీ పేర్కొన్నారు. వారం రోజులుగా నగరంలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీలు చేశామని పేర్కొన్నారు. నగరంలో అమిత్షా పర్యటించే ప్రాతంలోని అన్ని చోట్లా ఇళ్లను సైతం పరిశీలించామని వివరించారు.
CP Sai Chaitanya | కొత్తవారిని ఇళ్లలోకి ఆహ్వానించొద్దు..
అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. 10 కి.మీ వరకు పూర్తిగా పోలీసులు నిఘా ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజలు ఎవరూ కూడా కొత్తవారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించవద్దని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే 100కు లేదా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
CP Sai Chaitanya | ఇతర జిల్లాల నుంచి పోలీసులు..
కేంద్రమంత్రి అమిత్షా పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ (Adilabad), జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బందితో పాటు బెటాలియన్ సిబ్బంది (Battalion Police) బందోబస్తులో పాల్గొంటున్నారని వివరించారు. ఈ పర్యటన సందర్భంగా అడుగడుగునా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వివరించారు. డ్రోన్ కెమెరాలు, బైనాక్యూలర్లతో నిఘా విభాగం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. నగర ప్రజలు పోలీసు సిబ్బందితో సహకరించాలని సూచించారు.