అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao | గాంధీ కుటుంబం తెలంగాణ నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఆయనను పలువురు నిరుద్యోగులు కలిశారు. తమ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని వారు కోరారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్(Job calendar) ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చెప్పిందన్నారు. 2025 సగం అయిపోయినా.. ఇప్పటికీ జాడ లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Harish Rao | మెగా డీఎస్సీ ఎప్పుడు..
గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్లకు జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఫిబ్రవరి 2025లో మెగా DSC నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారన్నారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్(Notification) రాలేదని విమర్శించారు. ఇలాగే చాలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి.. నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Harish Rao | యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రానికి వచ్చి యూత్ డిక్లరేషన్ విడుదల చేసిందని హరీశ్రావు గుర్తు చేశారు. అందులో పేర్కొన్న ఐదు అంశాల్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చినా ప్రియాంక గాంధీ ఎటు పోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.